Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 డిసెంబరులో రూ.35,000 కోట్ల విలువ చేసే బంగారం దిగుమతి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (14:46 IST)
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు పసిడి ప్రియులు. దీంతో భారీగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం డిమాండ్‌కు మన దేశంలో భలే గిరాకీ ఉంది. ఫలితంగా గత 2021లో ఏకంగా 35 వేల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. 
 
గత 2021లో డిసెంబరు నెలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గత 2020 డిసెంబరు నెలలో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 2021తో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగింది. 
 
ఇకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు నెల వరకు తొమ్మిది నెలల కాలంలో 38 బిలియన్ డాలర్ల విలువ పసిడి దిగుమతులు నమోదైనట్టు తెలిపింది. 
 
కానీ, 2020 ఏప్రిల్ - డిసెంబరు కాలంలో ఇది 16.78 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అంటే 2021 సంవత్సరంలో బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments