Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 డిసెంబరులో రూ.35,000 కోట్ల విలువ చేసే బంగారం దిగుమతి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (14:46 IST)
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు పసిడి ప్రియులు. దీంతో భారీగా బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం డిమాండ్‌కు మన దేశంలో భలే గిరాకీ ఉంది. ఫలితంగా గత 2021లో ఏకంగా 35 వేల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. 
 
గత 2021లో డిసెంబరు నెలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గత 2020 డిసెంబరు నెలలో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 2021తో పోల్చితే ఇది స్వల్పంగా పెరిగింది. 
 
ఇకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు నెల వరకు తొమ్మిది నెలల కాలంలో 38 బిలియన్ డాలర్ల విలువ పసిడి దిగుమతులు నమోదైనట్టు తెలిపింది. 
 
కానీ, 2020 ఏప్రిల్ - డిసెంబరు కాలంలో ఇది 16.78 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అంటే 2021 సంవత్సరంలో బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యిందన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో పసిడి దిగుమతులు పెరిగినందున వాణిజ్య లోటు 142 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments