Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అండర్-19 ప్రపంచ కప్ : భారత కుర్రోళ్ళు భళా

అండర్-19 ప్రపంచ కప్ : భారత కుర్రోళ్ళు భళా
, ఆదివారం, 16 జనవరి 2022 (10:39 IST)
కేరేబియన్ గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా యువ భారత జట్టు సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి పోరులో భారత కుర్రోళ్లు విజయం సాధించారు. 45 పరుగుల తేడాతో గెలుపొందారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగి 46.5 ఓవవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 45.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
భారత జట్టులో కెప్టెన్ యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 చొప్పున పరుగులు చేశారు. ఇక రఘు వన్ని 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ ధుల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మయాండ్ పెవిలియన్ దారిపట్టడంతో భారత్ విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ జట్టు మనిద్దరం నిర్మించినది, నువ్వు తల పైకెత్తి వెళ్లవచ్చు: కోహ్లి రిటైర్మెంట్ పైన రవిశాస్త్రి