Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలకు స్వస్తి : తపాలా శాఖ నిర్ణయం

ఠాగూర్
గురువారం, 7 ఆగస్టు 2025 (08:50 IST)
భారత తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. నిజానికి ఈ సేవలు కొన్ని దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, టీచర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలతో 50 యేళ్ళకు పైగా ఈ సేవలు అనుబంధం కలిగివున్నాయి. ఈ సేవలను సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, ఈ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్టులో విలీనం చేయనున్నారు. ఫలితంగా అత్యంత చౌకకగా, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న నిలిచిన ఈ సేవలకు త్వరలోనే స్వస్తి చెప్పనున్నారు. ఇకపై రిజిస్టర్ పోస్ట్ తరహా ఫీచర్లు కలిగిన సర్వీసును ఇంకో పేరుతో స్పీడ్ పోస్టును అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ప్రస్తుతం తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తంతి తపాలా శాఖ నిర్వహిస్తోంది. పోస్ట్‌ను డెలివరీ చేసినట్టుగా ధృవీకరణ, పోస్ట్ ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం ఖచ్చితత్వంతో పోస్ట్ డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీసును ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీడ్ పోస్ట్‌ను కొనసాగించడం అనవసరమని భావించిన తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments