Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు షాకిచ్చిన చైనా.. ట్యాగ్‌లైన్ కొట్టేసింది....

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (09:50 IST)
భారత్‌కు చైనా షాకిచ్చింది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 48 గంటలు కూడా పూర్తికాకముందే చైనా తేరుకోలేని షాకచ్చింది. ఇది ప్రధాని మోడీకి ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 
 
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌లైన్ కలిగివుంది. దీన్ని చైనా కొట్టేసింది. దీనికి కారణం లేకపోలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదైంది. అదే చైనా విషయానికి వస్తే ఇది 6.8 శాతంగా నమోదైంది. అంటే భారత వృద్ధిరేటు (జీడీపీ) ఐదేళ్ళ కనిష్ట స్థాయికో పడిపోవడం చైనాకు కలిసివచ్చింది. 
 
అయితే, అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ 6.6 శాతంగా ఉండగా, మార్చితో ముగిసే సమయానికి ఇది 5.8 శాతానికి పడిపోయింది. మరోవైపు 2018-09 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతమని కేంద్ర గణాంకాల విభాగం వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో ఇది 7.2 శాతంగా నమోదైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments