Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎంఐంలపై మారటోరియం కావాలా? అయితే ఇలా చేయాలి...

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (13:22 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని సేవలు బంద్ అయ్యాయి. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. అదే సమయంలో లాక్ డౌన్ క్రైసిస్ కారణంగా మూడు నెలల పాటు ఈఎంఐలపై మారటోయం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో భారత రిజర్వు బ్యాంకు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, మూడు నెలల మారటోరియంను అమలు చేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ సూచనల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆ సదుపాయం కల్పిస్తూ ప్రకటనలు చేశాయి. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. ఈఎంఐలపై మారటోరియం అవసరం లేని వినియోగదారులు తమను సంప్రదించాల్సిన అవసరం లేదంటూ తమ ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర బ్యాంకులు తెలిపాయి. 
 
అలాగే, మారటోరియం కోరుకునే వినియోగదారుల కోసం ఓ ఈ-మెయిల్ ఐడీని కోటక్ మహీంద్ర బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. అయితే, మారటోరియం కాలానికి వడ్డీని మాత్రం వసూలు చేస్తామని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. వేతనదారుల రుణాలపై 'ఆప్ట్-ఇన్' , వ్యాపారుల కోసం 'ఆప్ట్-ఔట్' ఆప్షన్స్‌ను తీసుకొచ్చింది. ఏది ఏమైనా మారటోరియం కావాలా వద్దా అన్నది ఖాతాదారులకే అన్ని బ్యాంకులు వదిలివేశాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments