స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయా? ఎందుకని?

జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:49 IST)
జీఎస్టీతో చిన్న వ్యాపారుల కడుపు కొట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రస్తుతం మొబైల్ ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మొబైల్ ధరలు భారీగా పెరగనున్నాయి. అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  
 
కొన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్‌11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరింత భారం కానున్నాయి.  
 
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై 17 రకాల వస్తువులపై దిగుమతి సుంకం పెరిగింది. వీటిలో స్మార్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్స్‌ - కంపోనెంట్స్‌ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments