Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ 19: మానసిక ఆరోగ్య ఆవశ్యకతను తెలిపేందుకు చోప్రా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన హిందుజా ఫౌండేషన్‌

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:41 IST)
శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన హిందుజా గ్రూప్‌ యొక్క దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్‌ ఇప్పుడు మానసిక ఆరోగ్యం మరియు సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్‌ ఇప్పుడు చోప్రా ఫౌండేషన్‌, జాన్‌ డబ్ల్యు బ్రిక్‌ మెంటల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ మరియు సీజీ క్రియేటివ్స్‌ల భాగస్వామ్యంతో నెవర్‌ ఎలోన్‌ గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్‌ (వర్ట్యువల్‌) సదస్సులో భాగమైన స్పాట్‌లైట్‌ ఇండియాకు మద్దతునందిస్తుంది. మూడు గంటల పాటు జరిగే ఈ స్పాట్‌లైట్‌ ఇండియా విభాగంలో సద్గురు మరియు అభయ్‌ డియోల్‌ వంటి సుప్రసిద్ధ వ్యక్తులు ప్రసంగించనున్నారు.
 
ఈ వర్ట్యువల్‌ సదస్సు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ మరియు ఇతర మాధ్యమాలపై 21 మే 2021వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం కోసం తోడ్పడే ఉచిత ఆన్‌లైన్‌ ఉపకరణాలను neveralonesummit.live ద్వారా వినియోగించుకోవచ్చు.
 
హిందుజా గ్రూప్‌ కో ఛైర్మన్‌ మరియు హిందుజా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీ గోపిచంద్‌ పీ హిందుజా మాట్లాడుతూ, ‘‘మానసిక ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా ఉంటాయి. గుర్తించనటువంటి మహమ్మారిగా దీనిని వెల్లడించవచ్చు. తప్పుడు నమ్మకాల కారణంగా పరిస్థితి నివారించలేని స్థితికి చేరుతుంది. దీనికి వైద్య జోక్యమూ అవసరమవుతుంది. అయితే అది కూడా సవాల్‌గానే పరిణమిస్తుంటుంది. నా దృష్టిలో బాధిత వ్యక్తికి పలు రీతులలో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ సదస్సు ఆ తరహా అవకాశాలను వెల్లడిస్తుంది’’ అని అన్నారు.
 
హిందుజా ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీ పౌల్‌ అబ్రహమ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో శారీరక ఆరోగ్యంపై దృష్టిసారించిన విధంగా మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించలేము. నెవర్‌ ఎలోన్‌ సమ్మిట్‌ 2021లో భాగంగా స్పాట్‌లైట్‌ ఇండియాను నిర్వహించడంలో భాగంగా అల్కెమిక్‌ సోనిక్‌ ఎన్విరాన్‌మెంట్‌, చోప్రా ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నటికీ ఒంటరిలు కాదనే సందేశం వ్యాప్తి చేయగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
అల్కెమిక్‌ సోనిక్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫౌండర్‌, ఫ్లూటిస్ట్‌, సౌండ్‌ ఆర్టిస్ట్‌ సత్య హిందుజా మాట్లాడుతూ మనసు-శరీర ఔషదం పట్ల అవగాహన పెంచడంతో పాటుగా మానసిక శ్రేయస్సు భవిష్యత్‌ కోసం నూతన స్థిరమైన వ్యవస్థలను నిర్మించడానికి కళలు, సంభాషణను మిళితం చేస్తూ నిర్వహిస్తోన్న స్పాట్‌లైట్‌ ఇండియాలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
 
చోప్రా ఫౌండేషన్‌ ఫౌండర్‌, ఎండీ శ్రీ దీపక్‌ చోప్రా మాట్లాడుతూ, ‘‘మానసిక అనారోగ్యం కారణంగా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం సమిష్టిగా సహాయం చేయకపోతే, మనం మానవత్వ పరంగా అపూర్వమైన సంక్షోభంలోకి వెళ్లనున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments