Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించనున్నారా?

Webdunia
గురువారం, 27 మే 2021 (22:15 IST)
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చలామణీ నుంచి తప్పించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికను బట్టి తెలుస్తోంది. 
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని వెల్లడైంది. అంటే ఒక ఏడాదిలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణీ నుంచి తప్పుకున్నాయని అర్థమవుతోంది.
 
అయితే ఈ నోట్లు చలామణీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణాలేమిటో తెలియడం లేదు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో నగదు డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.500 నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లలో రూ.500 నోట్ల వాటా 68.4 శాతం. ఇది గత ఏడాది 60.8 శాతంగా ఉండేది.
 
రూ.2,000 నోట్లను అక్రమంగా దాచుకోవడం సులువుగా మారిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లభ్యతను మెరుగుపరచడంలో ఈ నోట్లు ఉపయోగపడినట్లు కొందరు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments