Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కామర్స్ సంస్థలకు ఎర్త్ పెట్టిన కేంద్రం.. 15 రోజులు టైమ్

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:09 IST)
ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఎర్త్ పెట్టింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ 16 నుంచి 21 వరకూ పండుగ ఆఫర్లు ఉంటాయని ప్రకటించగా, అమేజాన్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 
 
ఇక పండుగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు గ్రేట్‌ ఇండియన్‌ సేల్స్‌, బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తీరుపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర మూలాలు తెలిపే సమాచారం పొందుపరచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలకు నోటీసులు జారీ చేసింది. స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. ఇకపై ఈ నిబంధనల్ని ఏ ఈ-కామర్స్‌ సంస్థ విస్మరించరాదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments