Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీల బాదుడు?

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (14:47 IST)
బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలకు ప్రయోజనం చేకూర్చేలా రూ.3 వేలు దాటిన లావాదేవీలపై చార్జీలను వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. కిరాణా దుకాణంలో చిన్న వస్తువులను కొనుగోలు మొదలు ఇంటర్నేషనల్ బ్రాండ్ షాపుల్లో కొనుగోలు వరకు డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నారు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చంట్ చార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయాన్ని ఎన్.డి.టి.వి.ప్రాఫిట్ తన కథనంలో పేర్కొంది. 
 
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించే లక్ష్యంతో ఎండీఆర్ చార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీల విలువ ఆధారంగా ఈ ఎండీఆర్ చార్జీలను విధించేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. యూపీఏ ద్వారా రూ.3 వేలకు పైబడిన లావాదేవీలపై ఈ చార్జీలు విధించే యోచనలో కేంద్రం ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి మున్ముందు స్వస్తి పలకలనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments