Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న బంగారం ధరలు...

Webdunia
మంగళవారం, 21 మే 2019 (18:29 IST)
ఈ ఏడాదిలో పసిడి ధర పతనం కొనసాగుతూనే ఉంది. అడపాదడపా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఇక మంగళవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి, రూ.32,670కి పడిపోయింది. జ్యువెలర్లు, రిటైలర్ల నుండి బంగారానికి డిమాండ్ తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 
 
బంగారం ధర పడిపోతున్న తరుణంలో వెండి ధర మాత్రం ఇప్పటికి స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.37,350 వద్ద స్థిరంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 0.22 శాతం తగ్గి, 1,274.35 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 0.36 శాతం తగ్గడంతో 14.39 డాలర్లకు దిగొచ్చింది.
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.50 తగ్గి, రూ.32,670కు, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి, రూ.32,500కు దిగివచ్చింది. ఈ దోరణిని గమనిస్తే గత నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.660 పడిపోయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.31,710 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200కి పెరిగింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.32280 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,500గా కొనసాగింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments