Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బంగారం ధర వుంది చూశారూ... పిచ్చెక్కిస్తుందనుకోండి...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:59 IST)
భారత్‌లో బంగారానికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. అయితే డిమాండ్ లేని కారణంగా బంగారం ధర దిగివచ్చింది. రూ. 450 తగ్గడంతో గురువారం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.34,200కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం వల్లే పసిడి ధర తగ్గినట్లు ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ పేర్కొంది. అంతేకాకుండా అంతర్జాతీయంగానూ పసిడి ధర పడిపోయింది.
 
న్యూయార్క్ మార్కెట్‌లో సైతం బంగారం ధర 0.10 శాతం తగ్గడంతో ఒక ఔన్సు 1,319.10 డాలర్‌లు పలుకుతోంది. బంగారంతో పాటు వెండి కూడా అదే బాటలో పయనించింది. పారిశ్రామిక మరియు నాణేల తయారీదారు వర్గాల నుండి డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా తిరోగమనం చవిచూసింది. రూ.425 తగ్గడంతో కిలో వెండి రూ.41,050కి చేరింది. కాగా నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.120 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments