Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండాకులు మీవి కావు... శశికళ-దినకరన్‌లకు షాక్...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:36 IST)
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని పార్టీని, అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. శశికళ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోగా, పళని స్వామి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి పార్టీ తమదంటే తమదంటూ కోర్టుకు వెళ్లారు.
 
తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. అన్నాడీఎమ్‌‌కేకు చెందిన రెండాకుల గుర్తు, పార్టీ పేరు ముఖ్యమంత్రి పళని స్వామి వర్గానికే చెందుతుందని తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో శశికళ, టీటీవీ దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 నవంబర్‌లో ఎన్నికల కమీషన్ పార్టీ పేరును, గుర్తును పళని స్వామికే కేటాయించింది. అయితే పార్టీ తమదంటూ టీటీవీ దినకరన్ కోర్టుకు వెళ్లారు.
 
జస్టిస్ జీ.ఎస్. సిస్థానీ, జస్టిస్ సంగీత దింగ్రా సెహగల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో పార్టీపై వారికి ఎటువంటి హక్కు లేదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments