Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. హైదరాబాదులో భారీగా తగ్గిన పసిడి ధరలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:18 IST)
కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్‌ కారణంగా దేశంలో బంగారం ధరలు ఆమాంతం పడిపోయాయి. దేశీయంగా బంగారం వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం కాస్త తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 45,500 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు పడిపోగా.. వెండి ధరలు మాత్రం పెరిగిపోయాయి. 
 
కిలో వెండి ఏకంగా రూ. 4600 పెరిగి రూ.79200కి చేరుకుంది. కాగా, బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతులపై సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
 
హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments