Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:18 IST)
దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ మూడ్ నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గురువారం మరోమారు ఈ ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.400 పెరిగి రూ.78 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, దేశీయంగాను వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో పసిడి రెక్కలు రావడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
బుధవారం రూ.77,850 వద్ద ముగిసిన బంగారం గురువారం మరో రూ.400 పెరిగి తాజా గరిష్ఠమైన రూ.78,250 మార్కును దాటినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. మరోవైపు వెండికీ పసిడితో సమానంగా డిమాండ్‌ కొనసాగుతోంది. కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.94 వేల మార్కు చేరుకోవడం గమనార్హం. 
 
ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు... ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికితోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్‌ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments