Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:18 IST)
దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ మూడ్ నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గురువారం మరోమారు ఈ ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.400 పెరిగి రూ.78 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, దేశీయంగాను వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో పసిడి రెక్కలు రావడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
బుధవారం రూ.77,850 వద్ద ముగిసిన బంగారం గురువారం మరో రూ.400 పెరిగి తాజా గరిష్ఠమైన రూ.78,250 మార్కును దాటినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. మరోవైపు వెండికీ పసిడితో సమానంగా డిమాండ్‌ కొనసాగుతోంది. కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.94 వేల మార్కు చేరుకోవడం గమనార్హం. 
 
ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు... ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికితోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్‌ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments