Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన బంగారం - ఆల్‌టైమ్ గరిష్టం నుంచి క్షీణత

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (19:31 IST)
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారు ధరలు మరింత తగ్గుముఖం పట్టింది. ఆల్‌టైమ్ గరిష్టంగా పది శాతం ధర క్షీణించింది. భౌగోళిక ఉద్రిక్తల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇపుడిపుడే దిగొస్తోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1800 తగ్గుముఖం పట్టి, రూ.95,050 పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.94,600 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌‍లో దీని ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. 
 
దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.97 వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో రూ.98 వేలు ఉన్న వెండి ధర వెయ్యి రూపాయల మేరకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 16 డాలర్లు తగ్గుముఖం పట్టి 3160 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments