Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన బంగారం - ఆల్‌టైమ్ గరిష్టం నుంచి క్షీణత

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (19:31 IST)
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారు ధరలు మరింత తగ్గుముఖం పట్టింది. ఆల్‌టైమ్ గరిష్టంగా పది శాతం ధర క్షీణించింది. భౌగోళిక ఉద్రిక్తల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇపుడిపుడే దిగొస్తోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారుతుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1800 తగ్గుముఖం పట్టి, రూ.95,050 పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ.94,600 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌‍లో దీని ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది. మరోవైపు, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. 
 
దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ.97 వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో రూ.98 వేలు ఉన్న వెండి ధర వెయ్యి రూపాయల మేరకు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 16 డాలర్లు తగ్గుముఖం పట్టి 3160 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments