Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలకు రెక్కలు.. పడిపోయిన అమ్మకాలు.. దిగుమతుల్లో రికార్డు

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (08:32 IST)
దేశ వ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ కారణంగా పసిడి అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం దిగుమతులపై పడింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ, బంగారం రేట్లు మాత్రం ఆకాశానికి పెరిగిపోయాయి. ఎక్కువమంది పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. 
 
ఈ ప్రభావం మన దేశంలోనూ కనిపించింది. ఒక గ్రాము బంగారం ధర రూ.58 వేల నుంచి రూ.60 వేలకు పలికింది. అలా ఒక్కసారిగా బంగారం, వెండి ధరలకు రెక్కలు రావడంతో ఒకవైపు అమ్మకాలు పడిపోగా, మరోవైపు, దిగుమతులు కూడా దారుణంగా పడిపోయాయి. 
 
గతేడాది ఏప్రిల్ - జులై మధ్య కాలం నాటి దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 81.22 శాతం తగ్గి 247 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 18,590 కోట్లు)కు పడిపోయాయి. వెండి దిగుమతులదీ అదే పరిస్థితి. 
 
గత నాలుగు నెలల్లో 56.5 శాతం తగ్గి 68.53 కోట్ల డాలర్ల (దాదాపు 5,185 కోట్లు)కు క్షీణించాయి. ఫలితంగా వాణిజ్య లోటు అదుపులోకి వచ్చింది. గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 5,940 కోట్ల డాలర్ల నుంచి 1,395 కోట్ల డాలర్లకు తగ్గింది. 
 
నిజానికి మార్చి నుంచే పసిడి దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చిలో బంగారం దిగుమతులు 62.6 శాతం, ఏప్రిల్‌లో 99.93 శాతం, మేలో 98.4 శాతం, జూన్‌లో 77.5 శాతం తగ్గాయి. జులైలో మాత్రం స్వల్పంగా పుంజుకుని 4.17 శాతం పెరిగాయి. 
 
మరోవైపు, బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు కూడా పడిపోయాయి. గతేడాది ఏప్రిల్ - జులై మధ్యతో పోలిస్తే ఈ ఏడాది అదేకాలంలో భారత్‌ నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments