Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగ్గుమన్న బంగారం ధరలు ... రూ.50 వేలకు చేరిన ధర

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (08:15 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలను దాటిపోయింది. 
 
శుక్రవారం ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.760 పెరిగి, 50,070 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని అందుకుంది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 49,310, రూ.45,200 స్థాయిలో ఉన్నాయి. 
 
అమెరికాలో ద్రవ్యోల్బణం గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈ అక్టోబర్‌ నెలలో 6.2 శాతం పెరిగిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఐదు నెలల గరిష్ఠ స్థాయి 1,860 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది జూలై 21 తర్వాత పుత్తడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 
 
మరోవైపు, బంగారం బాటలోనే వెండి ధర సైతం జోరుగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ.70,600కు చేరింది. క్రితం రోజు ఇది రూ.69,300గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 25 డాలర్ల స్థాయిని దాటింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments