Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ: ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:38 IST)
భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో భారత్ నుండి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 
 
దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది.  
 
కొత్త మార్పుల కారణంగా విదేశీ ప్రయాణికులు జర్మనీకి వచ్చేందుకు పెద్దగా ఆంక్షలు ఉండకపోవచ్చు. ఇటీవలి కాలంలో పలు దేశాలు భారత్ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండగా.. ఆ లిస్టు లోకి జర్మనీ కూడా చేరింది.
 
వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌లో కరోనా కట్టడి అవుతూ ఉండడం.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో ఎటువంటి లక్షణాలు లేని వారిని, వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులను ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments