Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పటివరకు పెట్రో భారం భరించాల్సిందే : ధర్మేన ప్రధాన్

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (15:57 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై జనాలు గగ్గోలు పెడుతున్నారు. దానికితోడు వంట గ్యాస్ ధరను కూడా కేవలం నెల రోజుల్లో ఏకంగా వంద రూపాయల మేరకు పెంచేశారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.
 
ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌పై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ మ‌రోసారి స్పందించారు‌. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయో ఖచ్చితంగా అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌ని, అయితే మార్చి లేదా ఏప్రిల్‌లో త‌గ్గే అవకాశం ఉన్న‌ట్లు చెప్పారు.
 
ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే దేశాలు లాభాల కోసం ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ప్ర‌ధాన్ తెలిపారు. ఉత్ప‌త్తిని పెంచాల‌ని ర‌ష్యా, ఖ‌తార్‌, కువైట్‌లాంటి దేశాల‌పై తాను ఒత్తిడి తెస్తున్న‌ట్లు వివ‌రించారు. 
 
ఉత్ప‌త్తి పెరిగిన‌ప్పుడు బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర త‌గ్గుతుంద‌ని, ఆ ప్ర‌భావం చివ‌రిగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై కూడా ఉంటుంద‌ని చెప్పారు. గ‌తేడాది ఏప్రిల్‌లో ఈ దేశాలు ఉత్ప‌త్తిని త‌గ్గించాయి. ఇప్పుడు కొవిడ్ మునుప‌టి ప‌రిస్థితుల‌కు డిమాండ్ పెరిగినా.. ఉత్ప‌త్తి మాత్రం పెంచ‌డం లేదు అందుకే ధ‌ర‌లు ఈ స్థాయిలో ఉన్నాయి అని ప్ర‌ధాన్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments