Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికేన్ వల్లే ఇంధన ధరలు పెరుగుదల : పెట్రోలియం మంత్రి

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:40 IST)
కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత రెండు నెలలుగా ఇంధన ధరలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుఫానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. 
 
అయితే, దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయన్నారు. వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధానంపై విమర్శలు వచ్చినప్పటికీ... మంత్రి మాత్రం రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని సమాధానం చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments