Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు!!

వరుణ్
శుక్రవారం, 12 జులై 2024 (11:54 IST)
ప్రస్తుతం దేశంలో అత్యంత ఆదరణ చూరగొంటున్న వందే భారత్ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే నడుస్తున్నాయి. ఈ తరహా రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రిపూట నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను తయారు చేయిస్తుంది. 
 
ఇందులో భాగంగా, ఇప్పటికే తయారైన తొలి వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలును ఆగస్టు నెలలో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా వాటిని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
ఇందులోభాగంగా, దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలున్నాయి. ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణమ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. 
 
మరోవైపు సికింద్రాబాద్ - పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (సిట్టింగ్) రానున్నట్లు తెలిసింది. బోధన్‌ నుంచి ఖాళీగా వెళ్లి వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్, తిరుపతి - నిజామాబాద్‌ల మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లో ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక బోధన్‌కు తీసుకెళుతున్నారు. 
 
ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ - రాజ్‌కోట్‌ల మధ్య రాకపోకలు సాగిస్తోంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో ఉంటున్నారు. 
 
మరోవైపు కాచిగూడ - బెంగళూరు మధ్య 8 కోచ్‌లతో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్ బాగా ఉంది. దాన్ని 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండూ ద.మ. రైల్వే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తుది దశలో ఉన్న చర్లపల్లి టెర్మినల్ పనుల్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ద.మ. రైల్వే దృష్టి సారించింది. 
 
ప్రధాన మంత్రి మోడీతో ఈ రైల్వే టెర్మినల్‌ను ప్రారంభింపజేయనున్నట్లు సమాచారం. స్టేషన్‌కు మూడు రహదారులు ఉండగా.. ఒక వైపు కొంత భూసేకరణ అంశం అపరిష్కృతంగా ఉంది. మరో మార్గంలో జీహెచ్ఎంసీ రోడ్డు వేయాల్సి ఉందని ద.మ. రైల్వే వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం