Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. రూ.7 లక్షల వరకు బీమా

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 
 
ఇకపై పీఎఫ్ ఖాదారులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇది వరకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.6 లక్షల బీమా కవరేజ్ లభించేది. 2020 సెప్టెంబర్ 9న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు ఈపీఎఫ్ఓ చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ CBT ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే ఈ నిర్ణయం అప్పటి నుంచి అమలులోకి రాలేదు. అయితే ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బీమా కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments