Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. రూ.7 లక్షల వరకు బీమా

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 
 
ఇకపై పీఎఫ్ ఖాదారులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇది వరకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.6 లక్షల బీమా కవరేజ్ లభించేది. 2020 సెప్టెంబర్ 9న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు ఈపీఎఫ్ఓ చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ CBT ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే ఈ నిర్ణయం అప్పటి నుంచి అమలులోకి రాలేదు. అయితే ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బీమా కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments