Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (15:03 IST)
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారులకు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి గణనీయంగా తగ్గించింది. అంటే 16 యేళ్ల క్రితం ఉన్న వడ్డీ రేట్లపై ఇకపై అందివ్వనుంది. 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావంపడనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైఖేల్ డయాస్ వెల్లడించారు. 
 
కాగా, గత 1977-78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ యేడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018-19, 2016-17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమచేశారు. 2013-14, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము భారీగా తగ్గింది. దీంతో 2019-2020కిగాను 8.5 శాతానికి వడ్డీని తగ్గించారు. ఇపుడు దీన్ని 8.1 శాతంగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments