ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (15:03 IST)
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారులకు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి గణనీయంగా తగ్గించింది. అంటే 16 యేళ్ల క్రితం ఉన్న వడ్డీ రేట్లపై ఇకపై అందివ్వనుంది. 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావంపడనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైఖేల్ డయాస్ వెల్లడించారు. 
 
కాగా, గత 1977-78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ యేడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018-19, 2016-17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమచేశారు. 2013-14, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము భారీగా తగ్గింది. దీంతో 2019-2020కిగాను 8.5 శాతానికి వడ్డీని తగ్గించారు. ఇపుడు దీన్ని 8.1 శాతంగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments