Publish Date: Fri, 11 Mar 2022 (13:53 IST)
Updated Date: Fri, 11 Mar 2022 (14:09 IST)
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ), ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.50,000లు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.