Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు బాదేశారు.. గ్యాస్ సిలిండరుపై రూ.50 పెంపు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (08:47 IST)
ఆరు వారాల్లో గ్యాస్ సిలిండరుపై మరోమారు భారం మోపారు. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.50 పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఒక సిలిండర్ ధర రూ.1052కు చేరికంది. అయితే, ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేట్ ఇండియన్ లూటీ అంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇప్పటికే పెట్రోలు, డీజిలు ధరల పెంపుతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మరో భారం పడింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెంచడం దారుణమని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు వారాల్లో రెండో సారి సామాన్యులపై గ్యాస్‌ ధరను చమురు కంపెనీలు రెండోసారి పెంచేశాయి.
 
తాజా పెంపుతో 14.2 కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.1002 ఉండగా.. తాజా పెంపుతో రూ.1052కు చేరుకుంది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 50 రూపాయలు పెంచడం గమనార్హం. 
 
ఇక ఈ నెల 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.102 పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2355.50కు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్లే గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 2021 నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌పై రూ.190 పెరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments