Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్క కోసం.. బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు..

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:35 IST)
Dog
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది. ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. అయితే ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్‌ క్లాస్‌ మొత్తాన్ని బుక్‌ చేయడం ఇదే తొలిసారి.
 
సాధారణంగా ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలోని జే-క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్‌ క్లాస్‌ సీటు ఛార్జీ సుమారు రూ.20,000. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం మొత్తం బిజినెస్‌ క్లాస్ బుక్‌ చేసిన ఆ యజమాని రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేశాడు.
 
కాగా, దేశంలో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా మాత్రమే. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే అనుమతిస్తారు. సంబంధిత క్లాస్‌లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొనిస్తారు. మరోవైపు గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా డొమస్టిక్‌ విమానాల్లో రెండు వేల పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments