Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్క కోసం.. బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు..

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:35 IST)
Dog
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. దీంతో ఆ బొచ్చు కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా బుధవారం ఉదయం విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించింది. ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. అయితే ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్‌ క్లాస్‌ మొత్తాన్ని బుక్‌ చేయడం ఇదే తొలిసారి.
 
సాధారణంగా ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలోని జే-క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్‌ క్లాస్‌ సీటు ఛార్జీ సుమారు రూ.20,000. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం మొత్తం బిజినెస్‌ క్లాస్ బుక్‌ చేసిన ఆ యజమాని రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేశాడు.
 
కాగా, దేశంలో పెంపుడు జంతువులను అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా మాత్రమే. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే అనుమతిస్తారు. సంబంధిత క్లాస్‌లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొనిస్తారు. మరోవైపు గత ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా డొమస్టిక్‌ విమానాల్లో రెండు వేల పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments