Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బంగళా ఖరీదు రూ.435 కోట్లు.. కొనుగోలు చేసింది ఎవరో తెలుసా?

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:32 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరోగమనంలో పయనిస్తోందంటూ పలువురు నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, వీరి అభిప్రాయం తప్పని తెలుస్తోంది. ఎందుకంటే.. న్యూఢిల్లీలో ఓ రియల్టర్ కుమార్తె ఏకంగా రూ.435 కోట్లు వెచ్చించి బంగళాను కొనుగోలు చేసింది. ఈ భవనం హస్తినాపురంలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉంది. 
 
ఆ రియల్టర్ ఎవరో కాదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్. ఈయన కుమార్తె రేణుక తల్వార్. ఈమె బంగ్లాను కమల్ తనేజా నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 4,925 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాంతం ఉంది. ఇందులో 1,189 చ.మీ. బంగళాను నిర్మించారు. ఒక్కో చ.మీ.కి రూ.8.8 లక్షల చొప్పున ధర చెల్లించి బంగళాను కొనుగోలు చేశారు. 
 
ప్రస్తుతమున్న విలువ ప్రకారం 1,189 మీటర్లలో ఉన్న ఒక్క బంగ్లా ధర రూ.383 కోట్లు పలికింది. లటీన్స్ బంగ్లా జోన్‌లో రేణుక ఈ భవంతిని కొన్నారు. ఢిల్లీలో ప్రముఖులు నివాసముండే భవంతుల సముదాయం ఈ ప్రాంతం. దాదాపు 3 వేల ఎకరాల్లో, వెయ్యి బంగళాలతో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే నివాసముంటుంటారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments