Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ ఎన్‌కౌంటర్‌‌పై కేసీఆర్ మాట.. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లు

నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:30 IST)
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నయీం కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 
 
గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్ షిప్ లో మారణాయుధాలతో తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతని అరెస్టుకు ప్రయత్నించగా ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని వివరించారు. నయీం దందాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. అతని అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులో 741 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు 124 మంది నిందితులు అరెస్టు అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. నయీం కబ్జాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూమిని, అతనికి చెందిన 37 ఇళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments