Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా..? ఐతే ఈ వార్త చదవాల్సిందే..

Webdunia
బుధవారం, 24 జులై 2019 (12:49 IST)
ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. వేతనాలను పొందే వారు, వ్యాపారాల ద్వారా ఆదాయం పొందేవారు టాక్స్ ఆడిట్ నెట్ నుంచి ఈ ఏడాది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం వుంటుందని ఆదాయ పన్ను శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.


ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ కోసం.. అసెస్‌మెంట్ కేటగిరీల కోసం ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు గడువు తేదీని ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. 
 
అంతకుముందు ఈ తేదీ జూలై 31 వరకే పరిమితం అయ్యింది. ఈ తేదీలోపు ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఆ తేదీని నెలపాటు పొడిగిస్తూ సీబీడీటీ ప్రకటించింది. ఫైనాన్షియల్ ఇయర్ 19 కోసం టీడీఎస్ స్టేట్మెంట్ జారీ చేయడంలో జాప్యం కారణంగా గడువు పొడిగించాలని డిమాండ్లు రావడంతో సీబీడీటీ జూలై 31 వరకు పరిమితమై ఐటీ రిటర్న్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 119 కింద అమలు చేస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments