కేవలం 9 రోజుల్లోనే సిలిండర్ ధర అంత పెరిగిందా

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (09:27 IST)
వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కరోనాతో కుదేలైన సామాన్యులకు... రోజురోజుకు పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న గ్యాస్ బండ ధరలు...మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. 
 
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే... సిలిండర్‌ ధర 265 రూపాయలకు పైగా పెరగటం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలల కాలంలోనే ఐదు సార్లు గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి.
 
పెరిగిన వంటగ్యాస్ ధరలతో తెలంగాణలో వినియోగదారులపై సుమారు 150 కోట్ల రూపాయలకుపైగా అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.10 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. నెలకు సగటున 65 నుంచి 70 లక్షల సిలిండర్లను.. మూడు చమురు సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి.
 
ఏప్రిల్‌ నెలలో సిలిండరుపై10 రూపాయలు తగ్గించింది. కరోనా సమయంలో వాణిజ్య వినియోగం తగ్గినప్పటికీ గృహావసరాల సిలిండర్ల వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments