Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:16 IST)
మరో రెండు నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
గతేడాది మాదిరిగా ఈసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును ఆమె సమం చేశారు. దేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె.. 2019 జులై నుంచి ఇప్పటివరకు ఐదు పూర్తి స్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments