Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:46 IST)
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్ -6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకిరానుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేయనుంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్న విషయం తెల్సిందే. కేవలం మూడేళ్ల కాలంలోనే భారత్ ఈ మేరకు పురోగతిని సాధించడం గమనార్హం.
 
నిజానికి ఇంత అతి తక్కువకాలంలో ఈ తరహా ఫీట్‌ను సాధించిన దేశం ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. యూరో-4 నుంచి యూరో-5కి అప్‌గ్రేడ్ కాకుండానే దేశంలో యూరో-6 రకం అంటే బీఎస్-6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకి రానుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.
 
ఇదే అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్‌తో మార్చబోతున్నాయని చెప్పారు. 
 
ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయని... దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు. దీంతోపాటు... పెట్రోల్ ధరలు కూడా కాస్త పెరుగుతాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments