Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:46 IST)
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్ -6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకిరానుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేయనుంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్న విషయం తెల్సిందే. కేవలం మూడేళ్ల కాలంలోనే భారత్ ఈ మేరకు పురోగతిని సాధించడం గమనార్హం.
 
నిజానికి ఇంత అతి తక్కువకాలంలో ఈ తరహా ఫీట్‌ను సాధించిన దేశం ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. యూరో-4 నుంచి యూరో-5కి అప్‌గ్రేడ్ కాకుండానే దేశంలో యూరో-6 రకం అంటే బీఎస్-6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకి రానుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.
 
ఇదే అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్‌తో మార్చబోతున్నాయని చెప్పారు. 
 
ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయని... దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు. దీంతోపాటు... పెట్రోల్ ధరలు కూడా కాస్త పెరుగుతాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments