Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 గ్రేడ్ పెట్రోల్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (16:46 IST)
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్ -6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకిరానుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన పెట్రోల్, డీజిల్ దిశగా భారత్ అడుగులు వేయనుంది. ప్రస్తుతం మనం యూరో-4 గ్రేడ్ ఇంధనాన్ని వాడుతున్న విషయం తెల్సిందే. కేవలం మూడేళ్ల కాలంలోనే భారత్ ఈ మేరకు పురోగతిని సాధించడం గమనార్హం.
 
నిజానికి ఇంత అతి తక్కువకాలంలో ఈ తరహా ఫీట్‌ను సాధించిన దేశం ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. యూరో-4 నుంచి యూరో-5కి అప్‌గ్రేడ్ కాకుండానే దేశంలో యూరో-6 రకం అంటే బీఎస్-6 గ్రేడ్ రకం పెట్రోల్ అందుబాటులోకి రానుండటం గమనార్హం. యూరో-6 పెట్రోల్, డీజిల్ తో వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గిపోతుంది.
 
ఇదే అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6 గ్రేడ్‌తో మార్చబోతున్నాయని చెప్పారు. 
 
ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధనాన్ని సప్లై చేయడాన్ని ప్రారంభించాయని... దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు. దీంతోపాటు... పెట్రోల్ ధరలు కూడా కాస్త పెరుగుతాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments