Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ల శ్రేణిని విడుదల చేసిన బజాజ్ ఆటో

ఐవీఆర్
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (23:09 IST)
ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన, మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో, ప్యాసింజర్ విద్యుత్ ఆటో  శ్రేణిని ఈరోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను బజాజ్ RE E-Tec 9.0గా విడుదల చేసింది. బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ శ్రేణిని బజాజ్ ఆర్&డి సెంటర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. వీటిని వాలూజ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారుచేస్తున్నారు. ఈ కొత్త వాహనాలు విస్తృత పరిధి, అత్యధిక లోడ్ మోసే సామర్థ్యం, దీర్ఘకాలిక మన్నిక కోసం రూపొందించారు. 
 
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లలో IP67 రేటెడ్ అధునాతన Li-ion బ్యాటరీ, టూ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటరు వున్నాయి. బ్యాటరీని 16-amp, 220 V ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాలు 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిమీల వారంటీతో పాటు, కస్టమర్‌లకు భరోసా ఇవ్వడానికి, 24/7 రోడ్‌సైడ్ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది.
 
బాబ్జి నెల్లి, డివిజనల్ మేనేజర్ సేల్స్, కుబేర్. కె వి, డివిజనల్ మేనేజర్ సర్వీస్, బజాజ్ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ, “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్యాసింజర్, కార్గో ఫార్మాట్‌లలో అందించడం సంతోషంగా వుంది. ఈ సురక్షితమైన, విశ్వసనీయమైన, అధిక-పనితీరు గల వాహనాలను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల పట్ల మా లోతైన అవగాహనను ఉపయోగించాము. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments