Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొంచివున్న ఆర్థిక మాంద్యం : 1971 నాటి సమస్యే కారణం!!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (10:34 IST)
ప్రపంచం ఆర్థిక సమస్యను ఎదుర్కోనుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చరించారు. ప్రస్తుతం పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన తెలిపారు. బంగారం, వెండి, బిట్ కాయిన్‌లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి యటపడొచ్చని కియోసాకి తెలిపారు. ఆయన తాజాగా చేసిన పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆర్థిక చరిత్రలో కీలకమైన క్షణాలను ఎత్తి చూపారు. ఈ పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన పేర్కొన్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విద్యార్థి రుణ మార్కెట్ పతనం వల్ల తదుపరి సంక్షోభం ఏర్పడుతుందనే రికార్డ్స్ అభిప్రాయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
సాంప్రదాయ పొదుపు ఇకపై సురక్షితం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. తాను 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా ధనికులు డబ్బు కోసం పని చేయరని, పొదుపు చేసేవారు నష్టపోతారన్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడవచ్చని ఆయన అన్నారు. 2012లో రిచ్ డాడ్ ప్రవచనంలో తాను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైందని, దయచేసి జాగ్రత్తగా ఉండాలని కియోసాకి సూచించారు. ప్రస్తుతం కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments