Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం ముగింపు.. కోడిగుడ్ల ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:11 IST)
కార్తీక మాసం ముగియడంతో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం విశాఖ హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడి గుడ్లు ధర రూ. 580. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఈ రేటు ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. చిల్లర మార్కెట్‌లో ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ.6-50, రూ.7కు విక్రయిస్తుండగా.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే రేటు ఉంది.  కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
ఎందుకంటే ఆ మాసంలో చాలామంది గుడ్లు, మాంసం తినరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలుదారుల సంఖ్య తగ్గడంతో దుకాణాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో కొనుగోలుదారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కాస్త పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments