Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలు : రైల్వే శాఖ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:49 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కేవలం ఫెస్టివల్ రైళ్లు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. 
 
ప్రస్తుతం దశల వారీగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 65 శాతం మేరకు రైళ్ళ రాకపోకలు సాగుతున్నాయి. జనవరి నుంచి  మరో 250 రైళ్ళను అదనంగా నడుపుతున్నాం. మున్ముందు కూడా మరికొన్ని రైళ్లను అదనంగా నడుపుతామని రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా అదుపులోకి వచ్చింది. ఫలితంగా కొత్త కరోనా కేసుల నమోదు కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ళతో పాటు శతాబ్ది, రాజధాని రైళ్లను కూడా నడుపుతామని పేర్కొంది. అలాగే రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ఐపే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే సమయం ఆదా అవుతుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments