Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూచ్... నేను అలా అనలేదు.. వ్యవస్థలపై ఎంతో గౌరవం ఉంది.. కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:40 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షోకాజ్ నోటీసు ఆయనపై బాగానే పనిచేసింది. దీంతో ఆయన మాట మార్చారు. తాను ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పైగా, రాజ్యాంగ వ్యవస్థలపై తనకు ఎంతో గౌరవం ఉందని వివరణ ఇచ్చారు.
 
గురువారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘంతో పాటు.. కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను టీవీ ఫుటేజీల్లో చూసిన ఎస్ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 
 
దీంతో మంత్రి కొడాలి నాని దిగివచ్చారు. ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌కు వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని చెప్పారు. 
 
ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని తెలిపారు. ఎస్‌ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్‌ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments