Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్ : షోకాజ్ నోటీస్ జారీ

మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్ : షోకాజ్ నోటీస్ జారీ
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:23 IST)
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. మంత్రి కొడాలి నాని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. 
 
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 
 
వాస్తవానికి గత కొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డను కూడా పిచ్చాసుపత్రికి పంపాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురపాలక, జడ్పీటీసీ ఎన్నికలకు జగన్ సర్కారు సమ్మతం!