Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఆదివారం నుంచి దేశీయ విమాన సర్వీసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:21 IST)
కరోనా లాక్డౌన్‌‌ను కేంద్రం దశలవారీగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే అనేక అంశాల్లో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. మంగళవారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులు అనుమతినిచ్చింది. అలాగే ఆదివారం నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ యోచిస్తోంది. 
 
ఈ మేరకు సోమవారం ఉదయం పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయంతోపాటు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అధికారులు పలు నగరాల్లోని విమానాశ్రయాలను తనిఖీచేశారు. వాణిజ్యపరంగా విమానాలు నడిపేందుకు ఉన్న అవకాశాలను ఈ బృందం పరిశీలించినట్లు తెలుస్తున్నది. 
 
తొలి విడతలో భాగంగా తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు విమానాలు నడిపితే బాగుంటుందన్న సూచనలు కూడా అందాయి. రెండు గంటల వ్యవధి గల ప్రయాణాలకు ఎలాంటి భోజన సదుపాయం కల్పించకుండా విమానాలు నడుపవచ్చునని యోచిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, విమాన ప్రయాణికులు మాత్రం ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకొంటేనే ప్రయాణానికి అనుమతించాలన్న మరో సూచన కూడా అందినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే తొలుత ఐటీ సెక్టార్‌ నగరాలు అయిన ముంబై, హైదరాబాద్‌, బెంగళూరుకు విమానసర్వీసులు నడపేలా చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments