Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు పసైందన విందు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (18:52 IST)
ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం కల్పించేందుకు ఆ సంస్థ యాజమాన్యమైన టాటా గ్రూపు వివిధ రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, పండగ సీజన్‌ సందర్భంగా దేశీయ విమాన సేవల్లో కొత్త ఆహార మెనూను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటన చేసింది. 
 
రుచికరమైన భోజనాలు, అధునాతన అపిటైజర్స్‌ (భోజనానికి ముందు ఇచ్చే పదార్థాలు), నాణ్యమైన డెజర్ట్స్‌ (భోజనానంతరం ఇచ్చే పదార్థాలు)ను కొత్త మెనూలో చేర్చినట్లు తెలిపింది. భారతీయ వంటకాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. 
 
ఈ కొత్త మెనూ అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈ కొత్త మెనూను దేశీయ విమాన సర్వీసుల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే అంతర్జాతీయ సేవలకు విస్తరిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అంతర్గత సేవల విభాగం హెడ్ సందీప్ వర్మ తెలిపారు. 
 
కాగా, ఇటీవలే ఎయిర్ ఇండియా 'విహాన్‌.ఏఐ' పేరిట దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. రాబోయే అయిదేళ్లలో దేశీయ విమానయాన విపణిలో కనీసం 30 శాతం వాటా పొందడంతో పాటు అంతర్జాతీయ కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments