Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్

airasia
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (16:36 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఏసియా విమాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఏకంగా 50 లక్షల ఉచిత టిక్కెట్లను అందుబాటులోకి ఉంచింది. ఈ టిక్కెట్లు మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆ కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 
 
ఈ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ బిగ్ సేల్‌ను ప్రకటించింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంలలో అనేక ఏసియా దేశాల ప్రయాణికులు కూడా ఈ అఫర్‌కు అర్హులని తెలిపింది. రెండు నెలల క్రితం ఎయిర్ ఏసియా కస్టమర్లకు ఉచిత టిక్కెట్లను అందించిన విషయం తెల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో అక్రమ లోన్‌ యాప్స్‌కు చెక్.. రంగంలోకి దిగిన గూగుల్