Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం నీటిలో కాస్త నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చే

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (15:18 IST)
బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 1 స్పూన్ గ్రీన్ టీని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్న ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
 
ఇలా చేయడం ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చును. అదే మోతాదు బియ్యం నీటిలో స్పూన్ తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. అంతే మెుటిమల చర్మం కాస్త మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కాస్త బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఈ విధంగా చేయడం వలన మృదువైన, కోమలమైన చర్మాన్ని పొందవచ్చును. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పాలు పౌడర్‌లో బియ్యం నీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

చివరగా 4 స్పూన్ల బియ్యం నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments