Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీగడలో పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే...?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:23 IST)
చలికాలంలో పాదాల సంరక్షణకు ఏం చేయాలంటే.. ప్రతిరోజూ పాదాలను చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. 
 
అలానే చెప్పులు లేకుండా నడవకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువ రోజుల పాటు వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాదాలు పగుళ్లుగా ఉన్నప్పుడు బకెట్ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు, నిమ్మరసం కలిపి ఆపై పాదాలు అందులో పెట్టి అరగంట పాటు అలానే ఉండాలి. తరువాత మెత్తని బట్టతో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా తయారవుతాయి. 
 
నిమ్మ చెక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు కాంతివంతంగా మారుతాయి. కప్పు మీగడలో కొద్దిగా పసుపు, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేయడం వలన పాదాలు తాజాగా మారుతాయి.   

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments