గోరింటాకు పొడి, నిమ్మరసం తలకు పట్టిస్తే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (10:55 IST)
చాలామందికి తలలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఆ చుండ్రును తొలగించుకోవడానికి ఏవేవో నూనెను, షాంపూలు వాడుతుంటారు. అయిన కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఇప్పటి చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కింది చిట్కాలు పాటిస్తే.. చుండ్రు సమస్య నుండి తెలిగ్గా బయటపడొచ్చని చెప్తున్నారు.. అవేంటో చూద్దాం..
 
1. కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్యపోతుంది.
 
2. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీరు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. షాంపూకు బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఉండే క్రిములను తొలగిస్తుంది. దాంతో చుండ్రు కూడా పోతుంది.
 
3. గోరింటాకు పొడిలో 5 స్పూన్ల చక్కెర, స్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండవు.
 
4. ఓ పాత్రలో గులాబీ ఆకులను మరిగించుకోవాలి. అనంతరం ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments