ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే?

దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త

Webdunia
శనివారం, 1 జులై 2017 (13:21 IST)
దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం సౌందర్యం పెంపొందుతుంది.
 
ముఖం డల్‌గా కనిపిస్తే.. దోసపండు ముక్కను ముద్ద చేసుకుని.. ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఆరిపోయాక కడిగేస్తే ముఖం కాంతివంతమవుతుంది. దోసగింజల పొడి ముఖ సౌందర్యానికే కాకుండా పొడి జుట్టుకు చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే.. పాదాలు దూదిలా మెత్తబడతాయి.
 
ఇక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రభావం కళ్ళ చుట్టూ ఉండే చర్మంపై కూడా పడుతుంది. అందుచేత కంటి కిందటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. పాల పొడి, దోసగింజల పొడి సమానంగా తీసుకుని, నీటిలో కలిపి, కళ్ల చుట్టూ పూసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత కడిగేయాలి. కళ్ల చుట్టూ ఉండే ముడతలు, నల్లని వలయాలు, అలసటా పోయి, కళ్లు ప్రకాశవంతంగా తయారవుతాయని బ్యూటీషన్లు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలుగు యువతి హత్య.. అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు చంపేశాడు..

కాంగ్రెస్ - బీజేపీ పొత్తు .. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..

బెంగుళూరులో బీజేపీ మహిళా కార్యకర్త దుశ్శాసన పర్వం - పోలీసులే సూత్రధారులు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోయిన్ కోసం భార్యను తీవ్రంగా కొట్టిన దర్శకుడు... పూనమ్ కౌర్

Rajendraprasad: లెస్ లాజిక్, మోర్ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో పాంచాలి పంచ భర్తృక మూవీ

Santosh Sobhan: సంతోష్ శోభన్, మానస వారణాసి ల ప్రేమ కథగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ

ప్రభాస్ అంటే నాకు క్రష్ ఉండేది.. చికెన్ బిర్యానీని సూపర్‌గా వండుతారు.. మాళవిక మోహనన్

దటీజ్ మెగాస్టార్ క్రేజ్ : అమలాపురంలో ప్రీమియర్ షో తొలి టిక్కెట్ ధర రూ.1.11 లక్షలు

తర్వాతి కథనం
Show comments