Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టి....

Webdunia
గురువారం, 4 జులై 2019 (20:31 IST)
సాధారణంగా మన చర్మం రంగు ఎరుపా, చామనఛాయ అన్న విషయంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది. అందుకే మనం చంర్మం మెరుపుని సంతరించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. అలా చేయడం వలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో కొన్ని చిట్కాల ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరువాత రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
 
2. ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరువాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దనా చేస్తూ రుద్ది కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
 
3. కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకుని వాటిని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దనా చేయాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా ఉండి మెరుస్తుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments