తేనెను ముఖానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:52 IST)
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా అందానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.. ఓట్స్‌ను నీళ్లల్లో కాసేపు నానబెట్టాలి. ఆపై మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకున్న ఓ అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. తరువాత అరిచేత్తో తుడిచేసి మంచి నీళ్లతో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రెండు మూడు రోజులకు క్రమంగా చేస్తే ముఖం, మెడ భాగాలు మెరుస్తుంటాయి. 
 
కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడిచేయాలి. అందులో 10 చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మర్దన చేస్తే మంచిది. స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందుగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస ముక్కను ముఖానికి రుద్దుకుంటే మంచిదంటున్నారు బ్యూటీషన్లు. ఇలా రోజూ చేస్తుంటే ముఖవర్చస్సు కాంతివంతంగా మారుతుంది. ఎండవేడిమికి, వాయు కాలుష్యానికి నల్లబడ్డ చర్మం నిగారిస్తుంది. అలానే చర్మం సున్నితంగా మారుతుంది.
 
పొడిచర్మం నుండి తప్పించుకోవాలంటే అంత సులభం కాదు. దీనికి విరుగుడు తేనె. రాత్రి పడుకోబోయే ముందుగా తేనెలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత దూదితో తుడిచేస్తే సరిపోతుంది. పొడిచర్మంతో తలెత్తే సమస్యలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

తర్వాతి కథనం
Show comments