Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ తొక్కతో ముఖానికి ఫేస్ ప్యాక్...

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (11:30 IST)
కంటి కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే.. నిద్రలేమి, అలసట, ఒత్తిడి వంటి సమస్యల వలన వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగాలు చేసేవారి కళ్లు కూడా అలానే ఉంటాయి. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలని... బయట దొరికే క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. వీటిని ఉపయోగించినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు.. అయితే వీటికి బదులుగా ఈ చిట్కాలు పాటిస్తే కలిగే లాభాలేంటో చూద్దాం..
 
కీరదోసలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా నల్లటి వలయాలను కూడా తొలగిస్తాయి. అదేలా అంటే.. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి కంటి కింద రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే.. నల్లటి వలయాలు పోతాయి. 
 
ఉల్లిపాయ పొట్టులోని విటమిన్స్ చర్మ ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పొట్టును పేస్ట్‌లా తయారుచేసి అందులో కొద్దిగా ఆలివ్ నూనె, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే నల్లటి వలయాలు పోతాయి. తద్వారా ముఖం తాజాగా మారుతుంది. 
 
ఆపిల్ తొక్కలోని ఇఫ్లమేటరీ గుణాలు కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతాయి. ఈ తొక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి కొద్దిగా ఉప్పు, చక్కెర, మీగడ, కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత కడిగేసుకుంటే ముఖం కోమలంగా మారుతుంది. నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 
 
కాకరకాయలోని విటమిన్ ఎ, విటిమిన్ బి6 చర్మ తాజాదనం కోసం బాగా పనిచేస్తాయి. దీనితో జ్యూస్‌లే చేసి ఆ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు కలిపి కంటి కింద రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖ చర్మ మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments